2025-26 బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్
వెబ్ న్యూస్, బతుకమ్మ : 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కు బుధవారం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 11.14 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్ బాబు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అంతకుముందు ప్రజాభవన్ వద్ద గల నల్లపోచమ్మ గుడిలో బడ్జెట్ ప్రతులను ఉంచి భట్టి ప్రత్యేక పూజలు చేయించారు. కాగా ఈసారి రూ.3.20 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. పన్ను, పన్నేతర ఆదాయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆరు గ్యారెంటీలు, ఇతర సంక్షేమ పథకాలపై...