సీఏ పరీక్షలు వాయిదా
హైదరాబాద్, బతుకమ్మ : పాకిస్థాన్ తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఐసీఏఐ ప్రకటించింది. శుక్రవారం నుంచి మే 14 వరకు జరగాల్సిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. తిరిగి నిర్వహించేది ఎప్పుడో త్వరలోనే వెల్లడిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు.. వచ్చే 3 రోజులు విద్యాసంస్థల్ని మూసివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.