విద్యార్థుల సమయానుకూలంగా బస్సులు నడపాలి
. . . పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డిచ్పల్లి మండలంలోని ఘన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, అలాగే నవీపేట్ మోడల్ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం కళాశాల, పాఠశాల సమయాలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కుమార్ అన్నారు. ఈ మేరకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం నిజామాబాద్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్కు వినతిపత్రం సమర్పించారు....