హైదరాబాద్, బతుకమ్మ : రుద్రంగి మండలంలోని మానాల గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, ప్యాక్స్ డైరెక్టర్ బుర్ర శంకర్ గౌడ్ శుక్రవారం భారత రాష్ట్ర సమితి(బీయర్ఎస్) లో చేరారు. రాజధానిలోని తన స్వగృహంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పార్టీ కండ్వాను కప్పి బుర్రను పార్టీలోకిసాధారంగా ఆహ్వానించారు. అనంతరం ఏమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో అందరిని సమన్వయం చేసుకొంటూ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ వైస్ ఛైర్మెన్ పీసరి భూమన్న, పార్టీ గ్రామ శాఖ ప్రెసిడెంట్ నాయిని రాజేశం, వైస్ ప్రెసిడెంట్ గంగనర్సయ్య, రాజరాం, జుల భూమన్న తదితరులు పాల్గొన్నారు.