- 12 తులాల బంగారం, 20 తులాల వెండి అపహరణ
బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో చోరి జరిగింది.చనంగారి అంజయ్య సోదరి, తల్ల నాయమ్మ ఇతర కుటుంబ సభ్యులు రాత్రిపూట ఉడకపోత ఉండడంతో కింద ఇంటికి తాళం వేసి పైన దాబాపై పడుకున్నారు.అర్ధరాత్రి సమయంలో తాళాలు పగల కోట్టి దొంగలు ఇంట్లో చోరబడి సుమారు 12 తులాల బంగారం , 20 తులాల వెండి, 21 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాన్సువాడ సీఐ అశోక్ సంఘటన స్థలానికి చేరుకోని విచారణ చేపట్టారు.