బతుకమ్మ,మెండోరా:మెండోరా మండలం చాకిర్యల్ గ్రామానికి చెందిన యానం అమృత రావుకు చెందిన పాడి గేదే గురువారం విద్యుత్ షాక్ గురై మృతి చెందింది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర సపోర్ట్ కేబుల్ కు గేదె తాకడంతో విద్యుత్ తగిలి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి నట్లు హెడ్ కానిస్టేబుల్ రమేష్ తెలిపారు.