Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 7:15 pm Posted by : ramakrishna

బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్ల ఆవిష్కరణ

రుద్రూర్, బతుకమ్మ: వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని బీఆర్ ఎస్ పార్టీ మండల ఇంచార్జ్ గాండ్ల మధు పిలుపునిచ్చారు. శనివారం రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి, అంబం(ఆర్), సులేమాన్ నగర్ గ్రామాలల్లో రజతోత్సవ సభకు సంబందించిన పోస్టర్లను అవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఉదయం 8 గంటలలోపు అన్ని గ్రామాల నుంచి మండల కేంద్రానికి చేరుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.