Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2024, 6:37 pm Posted by : ramakrishna

వేల్పూర్ చౌరస్తా లో నేడు బీయర్ఎస్ రైతు ధర్నా

బతుకమ్మ, భీంగల్ : ఎన్నికల లబ్ది కోసం ఎక్కకాలంలో రూ. 2లక్షల ఋణ మాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చెసిన రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేడు బీయర్ఎస్ రైతు ధర్నాను నిర్వహించనున్నారు. ఏక కాలమని చెప్పి మూడు దాఫల మాఫీ చేసిన ఇప్పటి సగం మంది రైతులకు కూడా మాఫీ కాలేదని, అందరికి ఋణమాఫీ అని చెప్పి కొర్రిలు పెట్టి కొందరు రైతులకు ఇప్పటి ఋణ మాఫీ కానీ రైతులు శనివారం వేల్పూర్ చౌరస్తాలో హై పైన రోడ్డు ఎక్కనున్నారు. ఉదయం 10 గంటలకు ఈ ధర్నా కార్యక్రమంనకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ కానిస్టెన్సీ రైతులు, బీయర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.