Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 9:35 pm Posted by : ramakrishna

20న బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం

 బతుకమ్మ బోధన్ : బోధన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ ఆమేర్ శనివారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ ఆవిర్భావానికి 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా, రజతోత్సవాల కోసం బోధన్ నియోజకవర్గంలో విస్తృత సన్నాహక సమావేశ ఏర్పాట్లను ఏప్రిల్ 20, 2025 ఆదివారం ఉదయం 10:00 గం.లకు బోధన్ అప్నా ఫంక్షన్ హాల్ లో జరగనుంది. మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ అధ్యక్షతన సమావేశం జరగనుండగా, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత  ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు.