Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2025, 11:16 am Posted by : ramakrishna

 బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వినూత్న నిరసన

శాసనమండలి ఆవరణలో “అప్పులు ఘనం – అభివృద్ధి శూన్యం” అంటూ ప్లకార్డుల ప్రదర్శన

వెబ్ న్యూస్, బతుకమ్మ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై  శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వినూత్నంగా నిరసన చేపట్టారు.   “అప్పులు ఘనం – అభివృద్ధి శూన్యం” అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.  “అప్పులు ఆకాశంలో – అభివృద్ధి పాతాళంలో” అంటూ నినాదాలు చేశారు. రూ. 1.58 లక్షల కోట్ల అప్పు చేసి ఎంతమంది మహిళలకు రూ. 2,500, ఎంతమంది వృద్ధులకు రూ. 4,000 పెన్షన్, ఎంత మంది ఆడపిల్లలకు స్కూటీలు, ఎంత మందికి తులం బంగారం అందించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిలదీశారు.