శ్రీకాంత్ చారికి నివాళులర్పించిన బీఆర్ఎస్ నేతలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమర వీరుడు "కాసోజు శ్రీకాంతచారి" వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మ గుట్ట లోగల బీ ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి, మాజీ జెడ్పి చైర్మన్ దాదన్న గారి విఠల్ రావు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయనతోపాటు బీ ఆర్ ఎస్ నాయకులు సత్యప్రకష్, తెలంగాణ శంకర్, శేఖర్ రాజు, మీసాల శంకర్, విజయ్ కుమార్, కృష్ణ, అనిల్, భూపతి, సాదిక్ తదితరులు కలిసి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.