. . . మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే
పిట్లం, బతుకమ్మ :
పిట్లం మండల కేంద్రంలో ప్రభుత్వం తలపెట్టిన ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో బిఎల్ఓ లకు ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త సహకరించాలని మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే దిశా నిర్దేశం చేశారు. గురువారం పిట్లం మండల పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో పాల్గొని ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త ఓటర్ నమోదులో ముందుండి ప్రతి ఒక్కరిని చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. రానున్న ఎన్నికలలో కీలకంగా మారనున్న ఓట్ల జాబితాను సమర్థవంతంగా నిర్వహించే విధంగా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల పార్టీ ప్రెసిడెంట్ వాసరి రమేష్, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కవిత విజయ్, జొన్న శ్రీనివాస్ రెడ్డి, జంబిగ హనుమాన్లు, నర్సాగౌడ్, రహమతుల్లా, నారాయణరెడ్డి, కరీం, తదితరులు పాల్గొన్నారు.