Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 3:25 pm Posted by : ramakrishna

నీట మునిగి బావ, బావమరిది మృతి

చేపల వేటలో విషాదం

నందిపేట మండలం సిద్ధాపూర్ లో ఘటన.

నిజామాబాద్/ నందిపేట్ :  ఆర్మూర్ మండలం మచ్చర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రంజాన్ పండుగ సందర్భంగా చుట్టరికంగా వచ్చిన బావ తో కలిసి బావమరిది సరదాగా చేపల వేటకు వెళ్లారు. ఇద్దరూ ప్రమాదవశాత్తూ నీట మునిగి మరణించారు. మచ్చర్ల గ్రామానికి చెందిన షేక్ షాదుల్లా (46),షేక్ మహమ్మద్ రఫీక్ (47)లు శుక్రవారం సాయంత్రం నందిపేట మండలం సిద్ధాపూర్ లోని ముని కుంటకు చేపలు పట్టడానికి వెళ్లారు. ఒకరు నీటిలో పడిపోవడంతో అతడిని రక్షించే క్రమంలో మరొకరు నీట మునిగి మరణించారు. నందిపేట ఎస్సై చిరంజీవి సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.


Brother-in-law and sister-in-law die in drowning