ట్రాక్టర్ ఢీకొని బాలుడు మృతి
కామారెడ్డి, బతుకమ్మ : సదాశివనగర్ మండలంలో ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందిన విషాద సంఘటన సదాశివనగర్ మండల పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన సంగేమ్ అజిత్ కుమారుడు లక్ష్మణ్ (9) స్థానిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. సదాశివ నగర్ మండలంలోని యాచారం గ్రామం వద్ద బాలుడిని ఒక ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలుడిని తక్షణమే చికిత్స నిమిత్తం...