Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2025, 6:34 pm Posted by : ramakrishna

ఎంపీ నిధులతో బోరు మోటార్ ప్రారంభం 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలోని 6 వార్డు పోచమ్మ దేవాలయం వద్ద తాగు నీటి సమస్య ఉందని స్థానిక బీజేపీ నాయకులు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి లు కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసి వివరించగా వెంటనే ఎంపీ నిధుల నుండి నూతన బోరు మోటార్ ను మంజూరు చేయగా శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి బాలయ్య,గడ్డం రవి, పొన్నాల కార్తీక్ రెడ్డి,పొన్నాల గోపి,కంకణాల శేఖర్, పరశురాములు, చిన్ని రవి, మామిళ్ల నరసయ్య,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Boru Motor launched with MP funds