Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 June 2025, 5:05 pm Posted by : ramakrishna

రక్తదాతలు.. ప్రాణదాతలతో సమానం..

  • బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

 

బాన్సువాడ బతుకమ్మ : రక్తదానంతో ప్రాణాలు కాపాడవచ్చని సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. బుధవారం రక్తదానం చేసిన ఏఎస్ఆర్ ఫౌండేషన్  సభ్యులకు సర్టిఫికెట్లను అందజేశారు. ప్రతి వ్యక్తి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని, రక్తదానం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు.గర్భిణుల కోసం రక్తదానం చేయడం వల్ల ఇద్దరి ప్రాణాలను కాపాడిన ప్రాణదాతలు అవుతారని పేర్కొన్నారు. మరిన్ని స్వచ్చంద సంస్థలు, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఆర్ ఫౌండర్ సంతోష్, జిల్లా అధ్యక్షుడు బంగారు రవి, బేజుగం సంతోష్, దాత్రిక్ విఠల్, సురేష్, మహేందర్, సాయిలు, అనిల్ పాల్గొన్నారు.