ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం
ఆర్మూర్, బతుకమ్మ : ఆర్మూర్ పట్టణంలోని సి కన్వెన్షన్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటురి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య శ్రీనివాస్,మాజి చైర్మన్ పండిత్ పవన్,కాంగ్రెస్ నాయకులు చిలుక రాజు, మడావేటి శ్రీకాంత్, ప్రముఖ వ్యాపారవేత్త పడాల్ మనోజ్, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.