- బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : స్థానిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణు అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎల్లారెడ్డి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల ఆశావాహుల కార్యకర్తల సమావేశానికి బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నంది వేణు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి క్లుప్తంగా అభ్యర్థులకు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ కచ్చితంగా ఎల్లారెడ్డి జెడ్పిటిసి, ఎంపీపీ, ఎంపీపీ పీఠం కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఎంపీటీసీ పరిధిలో బిజెపి పార్టీ తరఫున అభ్యర్థులు బరిలో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని దేవేందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రి బాలకిషన్, ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు పెద్దెల్ల నరసింహులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పోతుగంటి సాయిలు, పట్టణ అధ్యక్షులు రాజేష్, మండల ప్రధాన కార్యదర్శి జక్కుల అశోక్, పంతులు, మహేందర్, కుచల, కంటి శంకర్, కార్యదర్శి సాయిలు, ఉపాధ్యక్షులు బద్దుల రాములు, సాయి రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి పికే నరేష్, సీనియర్ నాయకులు ఎస్ ఎన్ రెడ్డి, కాశీనాథ్, పండరి ,లక్ష్మారెడ్డి, రాజు, నరసింహారెడ్డి, బీజేవైఎం గణేష్, బీజేపీ కార్యకర్తలు తదిరులు పాల్గొన్నారు.