రుద్రూర్, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ రుద్రూర్ మండల కమిటీని జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు ఆదేశానుసరం బుధవారం మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ బిజెపి మండల కమిటీని ప్రకటించడం జరిగింది. మండల ఉపాధ్యక్షులుగా, ఎం.వి.కృష్ణం రాజు, బేగరి వినోద్ కుమార్, రేపల్లి సాయిప్రసాద్, బోజిగొండ అనిల్ నియమితులయ్యారు. మండల ప్రధాన కార్యదర్శులుగా ఏముల గజేందర్, వడ్ల సాయినాథ్, నియమితులయ్యారు. మండల కార్యదర్శులుగా ఎర్రోళ్ల శంకర్, కొండలవాడి సాయిలు, జీలకర్ర విజయ్, అంకెరాజేష్, కోశాధికారిగా కటిక రాంరాజ్, మండలంలోని అన్ని గ్రామాల నుండి 35 మందిని మండల కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు. నూతనంగా మండల కమిటీలో నియమితులైన వారందరికీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతనంగా నియమితులైన వారందరు రుద్రూర్ మండలంలో పార్టీని బూత్ స్థాయి నుండి పటిష్టం చేస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.