నిజామాబాద్ సభకు తరలివెళ్లిన బిజెపి నాయకులు

రుద్రూర్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమీత్ షా విచ్చేసిన సందర్భంగా ఆదివారం రుద్రూర్ మండలంలోని పలు గ్రామాల నుండి బీజేపీ నాయకులు, కార్యకర్తలు సభకు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. తరలివెళ్లిన వారిలో జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, బిజీపి పార్టీ సీనియర్ నాయకులు కటికే రామ్ రాజ్, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.