Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 6:53 pm Posted by : ramakrishna

నూతన బోరు మోటర్ ను ప్రారంభించిన బీజేపీ నాయకులు

  • ఎంపీ బండి సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీవాసులు, బీజేపీ నాయకులు

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామంలో ఇటీవల ఎంపీ నిధులతో వేసినటువంటి బోర్ కి నూతనంగా బిగించిన బోరు మోటారును కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన, గొల్లపల్లి గ్రామ కాలనీవాసులు, బిజెపి నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోరు మోటారుతో ఈ కాలనీలో నీటి సమస్య తిరిగిందని ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో బిజెపి మండల కార్యదర్షులు దాసరి గణేష్,నంది నరేష్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీశైలం, బీజేపీ మండల ఉపాధ్యక్షులు శ్యాగ లక్ష్మన్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఉడుగుల యాదగిరి,జిల్లా ఐటీ ఇన్చార్జి ప్రకాష్,మండల బీజేవైఎం అధ్యక్షులు జితేందర్ రెడ్డి, మారావేణి రంజిత్ కుమార్, మాలోత్ సాయి కిరణ్ నాయక్, దండు నవీన్,అజ్మీరా గణేష్, రమేష్ నాయక్,గొల్లపల్లి గ్రామస్తులు,బూత్ అధ్యక్షులు పందిల్ల మధు, దాసరి పవన్, యోగేందర్, కుడుకల అరవింద్ అనిల్, పెంజర్ల వెంకటేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

BJP leaders launch new bore motor