డీజీపీ ఆఫీసు ముట్టడించిన బీజేపీ నేతలు
హైదరాబాద్, బతుకమ్మ : నగర శివారు పోచారం ఐటీ కారిడార్ లో గోసంరక్షుడు సోనూసింగ్ పై కాల్పుల ఘటన నేపథ్యంలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో పాటుపలు వురు నేతలను పోలీసులు అరెస్టు చేసి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈసందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారు ఎంఐఎం గుండాలను పోషిస్తుందని ఆరోపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని...