రుద్రూర్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికలలో భాగంగా 15వ వార్డు అభ్యర్థి గుడుగుట్ల సారిక అనిల్ కు మద్దత్తుగా బాన్సువాడ పట్టణంలో గురువారం రుద్రూర్ మండల బీజేపీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కౌన్సిల్ మెంబర్ గుండూరు ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ.. ఓటర్లలో బీజేపీ బలంగా ఉందన్నారు. ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని పేర్కొన్నారు. 15 వ వార్డు అభ్యర్థి గుడుగుట్ల సారిక అనిల్ కు ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపల్ ఎలక్షన్ ఇంచార్జ్ ఇంద్రసేనారెడ్డి, జిల్లా సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి, సున్నం సాయిలు, తృప్తి శివ ప్రసాద్, కోటగిరి మండల అధ్యక్షులు వేముల నవీన్, రుద్రూర్ మండల అధ్యక్షులు అలపాటి హరికృష్ణ, అంబం సర్పంచ్ గంగాధర్, గణేష్, వడ్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.