ముందస్తుగా రౌడీ షీటర్ల బైండోవర్
రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన రౌడీషీటర్లు మడిగిల ఆరేళ్ల చిన్న సాయిలు, బత్తుల గంగాసాగర్ లను బుధవారం తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయడం జరిగిందని రుద్రూర్ ఎస్సై పి. సాయన్న తెలిపారు. రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఉండడానికి వీరిని బైండోవర్ చేయడం జరిగిందని ఎస్సై వెల్లడించారు.