వెబ్ న్యూస్, బతుకమ్మ : మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్ గేట్స్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా డిల్లీలోని పార్లమెంట్ భవనాన్ని బుధవారం ఆయన సందర్శించారు. కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డాతో బిల్ గేట్స్ సమావేశమయ్యారు. ఈసందర్భంగా పలు కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం ఏపీ సీఎం చంద్రబాబుతో బిల్ గేట్స్ భేటీకానున్నారు. పలు ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది.