ఓటు వేసిన బిహార్ సీఎం నితీష్ కుమార్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  బిహార్‌ మొదటి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బిహార్ మొదటి విడత పోలింగ్‌లో మధ్యహ్నం 1 గంటల వరకు 42.31శాతం నమోదైంది. గురువారం   3.75 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 45 వేలకుపైగా కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతుంది.  16 మంది మంత్రులు సహా 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.