పాండురంగడి ఆలయంలో బిగాల దంపతుల పూజలు
మాక్లూర్, బతుకమ్మ: మాక్లూర్ లో ని పాండురంగస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2023లో గణేశ్ గుప్తా ఆలయాన్ని నిర్మింపజేసి పాండురంగస్వామితోపాటు అయ్యప్పస్వామి, వీరహనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. వార్షికోత్సవం సందర్భంగా బిగాల దంపతులు ప్రత్యేకపూజల అనంతరం బ్రాహ్మణులకు గోదానం ఇచ్చారు. అలాగే 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ వ్యవసాయ క్షేత్రంలో ఏకబిల్వం, కొబ్బరి మొక్కలను నాటారు.