బీబీనగర్, బతుకమ్మ : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ విద్యార్థి స్థానికంగా ఉన్న పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని ఎయిమ్స్ లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న అభిజిత్ (23) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చెరువు నుంచి వెలికి తీశారు.