కోర్టు నూతన భవన నిర్మాణానికి భూమి పూజ

బాన్సువాడ, బతుకమ్మ  : బాన్సువాడ పట్టణంలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నూతన భవన నిర్మాణానికి హైకోర్టు జడ్జీలు జే శ్రీనివాస్‌రావు, అలిశెట్టి లక్ష్మీనారాయణ శనివారం భూమి పూజ చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు టీఎస్‌పీ భార్గవి, సుధాకర్‌, సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి, డీఎస్పీ సత్యనారాయణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు లక్ష్మీనారాయణమూర్తి, భూషణ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.