భిక్కనూరు, బతుకమ్మ :
జాతీయస్థాయి సీనియర్ మాడ్రన్ కబడ్డీ పోటీలకు న్యాయ నిర్ణేతగా భిక్కనూరుకు చెందిన కర్రోళ్ల మహేష్ ఎంపికయ్యారు. ఈ మేరకు కామారెడ్డి జిల్లా నుండి వాయామ ఉపాధ్యాయులు గా ముగ్గురు ఎంపికయ్యారని మాడ్రన్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కుంభం రాంరెడ్డి సెక్రటరీ తిరుపతి బుధవారం తెలిపారు. తిరుపతి మాట్లాడుతూ గత సంవత్సరం 2025డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మాడ్రన్ కబడ్డీ పోటీల్లో ఉత్తమ న్యాయ నిర్ణేతలుగా నిర్వహించినందుకు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని ఈ నెల 15 నుండి 18 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో జరగబోయే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు న్యాయ నిర్ణేతలు గ ఎంపికయ్యారని తెలిపారు.