Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 October 2025, 8:43 pm Posted by : ramakrishna

భీంగల్ బ్రిడ్జి పనులు ప్రారంభం

భీంగల్, బతుకమ్మ : ఇటీవలే కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న భీమ్ గల్ నుండి బడా భీమ్ గల్ మధ్యలో గల కప్పల వాగు బ్రిడ్జ్ మరమ్మత్తు పనులు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ఈ ఆర్ అండ్ బి పనులు ప్రారంభానికి గాను కృషి చేసిన రాష్ట్ర ఖనిజాభివృద్ధి చైర్మన్ ఈరవత్రి అనిల్ రాష్ట్ర కోఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, కానిస్టెన్సీ కాంగ్రెస్ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డిలకు, మరమ్మత్తు పనులకు నిధులు మంజూరు చేయించిన పీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ లకు భీమ్ గల్ మండల ప్రజల తరపున స్థానిక కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.