జాతీయ పసుపు బోర్డు అదనపు కార్యదర్శిగా భవానీశ్రీ
నిజామాబాద్, బతుకమ్మ : జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు, చైర్మన్ నియామకం తర్వాత అధికారుల నియామకాలను కేంద్ర వాణిజ్యమంత్రిత్వ శాఖ చేపట్టిందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ తెలిపారు. వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ 2017వ బ్యాచ్ నాగాలాండ్ కేడర్ కి చెందిన ఎన్. భవానిశ్రీ జాతీయ పసుపు బోర్డు అదనపు కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు వాణిజ్య, పరిశ్రమల శాఖ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్ (పరిశోధన) డాక్టర్...