Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 March 2025, 12:39 pm Posted by : ramakrishna

రాజీవ్ యువ వికాసం పథకంపై భట్టి సమీక్ష

వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్ లో ప్రజా భవన్ లో జరిగిన సమావేశంలో రాజీవ్ యువ వికాసం పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం సమీక్ష నిర్వహించారు.  ఈసమావేశానికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ల చైర్మన్ లు ప్రీతం, బెల్లయ్యనాయక్, ఓబేదుల్ల కొత్వాల్ హాజరయ్యారు.  రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలపై వారు చర్చలు జరిపారు. సోమవారం రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ వికాసం పథకం సువర్ణ అవకాశంగా మారనుంది.