ఎల్లారెడ్డి,(లింగంపేట)బతుకమ్మ :లింగంపేట మండలంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మండలంలోని పలు గ్రామాల్లో రైతులు జెండాలు ఆవిష్కరించారు.విశ్రాంత ఉద్యోగి గడ్డం గోపాల్ రెడ్డి,రాధావ్వ దంపతులను కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాయిరెడ్డి,వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.