Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 July 2025, 2:26 pm Posted by : ramakrishna

ఢిల్లీలో ప్రారంభమైన భాగేదరి న్యాయ సమ్మేళనం

పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు

ఢిల్లీ , బతుకమ్మ : ఢిల్లీ తల్కొటోర స్టేడియంలో భాగేదరి న్యాయ సమ్మేళనం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం నుంచి బీసీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈసమ్మేళనం లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఎంపీ.అనిల్ యాదవ్, షెట్కార్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నాయకులు పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, కర్నాటక సీఎం సిద్దిరామయ్య హాజరయ్యారు.


Bhagedari Nyaya Sammelan started in Delhi..