Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 August 2025, 6:11 pm Posted by : ramakrishna

బీజీకేఎస్ నిజామాబాద్ డివిజన్ నూతన కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్  సిటి, బతుకమ్మ :  భారతీయ గ్రామీణ కర్మాచారి సంగ్ నిజామాబాద్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నగరంలోని ప్రగతినగర్ లో గల మాదవ నిలయంలో బీజీకేఎస్ నిజామాబాద్ డివిజన్ మొదటి మహాసభ జరిగింది. తెలంగాణ బీఎంఎస్ గ్రూప్ సి కార్యదర్శి లక్ష్మీనారాయణ, అధ్యక్షులు కిషోర్, అసిస్టెంట్ సర్కిల్ కార్యదర్శి లింబాద్రి, అసోసియేట్ ప్రెసిడెంట్  శ్రీనివాస్, డివిజన్ సెక్రటరి సాయారెడ్డి, జీడీఎస్ సెక్రటరి వినయ్ సుధీర్, జిల్లా అధ్యక్షులు స్వామికుమార్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డివిజన్ నూతన అధ్యక్షులుగా చంద్రశేఖర్, కార్యదర్శిగా వేణుగోపాల్, కోశాధికారిగా దేవరాజులను, ఇతర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.