. . . దాతలకు ధన్యవాదాలు తెలిపిన సుల్తాన్ పేట్ గ్రామస్తులు
మద్నూర్, బతుకమ్మ:
సుల్తాన్ పేట్ గ్రామపంచాయతీ ఆవరణలో దాతల సాయంతో బెంచులు ఏర్పాటు చేశారు. మద్నూర్ మండలం సుల్తాన్ పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం గ్రామస్తులకు సౌకర్యార్థంగా ఉంటుందనే ఉద్దేశంతో గ్రామస్తులు తో పాటు గ్రామ సెక్రెటరీ సంజీవ్, సంతోష్ పటేల్, సంజు మహారాజ్, ధనరాజ్ గౌడ్, రాజ్ కుమార్ పాటిల్, హనుమ గౌడ్ వీరి సహకారంతో సిమెంటుతో తయారుచేసిన 12 బెంచీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్, సెక్రెటరీ సంజీవ్, సంజు మహారాజ్, రహీం, అంజయ్య ఉన్నారు.