Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 October 2024, 5:21 pm Posted by : ramakrishna

సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి

బతుకమ్మ, పిట్లం : పిట్లం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బండపల్లి గ్రామంలో సైబర్ నేరగాళ్లపై గ్రామ ప్రజలకు సోమవారం అవగాహన కల్పించారు. ఏఎస్ఐ లింబాద్రి మాట్లాడుతూ మొబైల్ కు ఎవరైనా ఫోన్ చేసి ఓటిపి చెప్పండి అని అడుగితే ఎట్టి పరిస్థితులలో ఓటీపీ చెప్పకూడదు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుండి బైకు ద్వారా బయలుదేరే ముందు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది నగేష్ రెడ్డి,శ్రీకాంత్,  రాజు, గుల నడిపి సంగబోయి సాయిలు, గంగారం,బండపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుంటి రాములు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.