సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని కంచర్ల గ్రామంలో డిఎస్పి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే దొంగతనాలు అరికట్టవచ్చని తెలియజేశారు. ఇటీవల జరిగిన హత్య నేరం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో భిక్కనూరు సిఐ సంపత్ కుమార్ ఎస్సై సాయి కుమార్ పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.