సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

రుద్రూర్, బతుకమ్మ : సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రుద్రూర్ ఎస్సై సాయన్న తెలిపారు. ఆదివారం రుద్రూర్ మండల కేంద్రంలోని బుషి విచార్ కేంద్రంలో సైబర్ నేరాలు, సిసి కెమెరాల ఏర్పాటు పై ఎస్సై సాయన్న గ్రామ పెద్దల సమక్షంలో అవగాహన కల్పించారు. తమ ఓటీపి నంబర్లను ఎవ్వరికీ చెప్పవద్దని సూచించారు. ప్రధాన కూడలీల వద్ద తప్పనిసరిగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.