బాధ్యతగా మెలగండి
. సిబ్బందికి కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర సూచన . భిక్కనూరు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ భిక్కనూరు, బతుకమ్మ: పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యతగా మెలగాలని సిబ్బందికి కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చం ద్ర సూచించారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్, సర్కిల్ కార్యాలయాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సైబర్ మోసాలబారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని, పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఎస్సై ఆంజనేయులు, సిబ్బంది ఉన్నారు.