Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 March 2025, 2:35 pm Posted by : ramakrishna

గాలి, నీరు, నిప్పుతో జాగ్రత్తగా ఉండాలి

హోలీ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ సూచన

వెబ్ న్యూస్, బతుకమ్మ :  కరీంనగర్ లోని బీజేపీ జిల్లా కార్యాలయం ఎదుట శుక్రవారం హోలీ వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ముఖ్య కార్యకర్తలు, అభిమానులకు రంగులు పూసి, చల్లారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు, హిందూ బంధువులకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.  యువత పండుగ పూట గాలి, నీరు, నిప్పుతో జాగ్రత్తంగా ఉండాలని, సాన్నాలు చేసేందుకు చెరువుల, నదులకు వెళ్లి ప్రాణాలు పొగొట్టుకోవద్దని సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు కష్టాల్లో ఉన్నారని, అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆరోపించారు.