బతుకమ్మ, పిట్లం : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను స్వాగతిస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాముని సుదర్శన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన స్థానిక పిట్లం మార్కెట్ యార్డులో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతో కొందరు సర్వేపై అపోహాలు సృష్టిస్తున్నారన్నారు. బీసీ లు ఎలాంటి అపోహలకు గురి కాకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి నీలకంటి సంతోష్, జుక్కల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆకుల లక్ష్మణ్ యాదవ్, మండల ఉపాధ్యక్షులు బాబాగౌడ్ యూత్ అధ్యక్షులు కాటేపల్లి హనుమన్లు,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ అఫ్రోజ్, సీనియర్ బీసీ నాయకులు మరగల దయానంద్, చిప్ప శివ,గూడ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.