నిజామాబాద్, బతుకమ్మ : బీసీ బంద్ ను పార్టీలు, కులాలకు అతీతంగా విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. మంగళవారం నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లను కొందరు హైకోర్టులో కేసు వేసి నిలిపివేయించడాన్ని నిరసిస్తూ.. ఈనెల 18న రాష్ట్రవ్యాప్త బంద్ కు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పిలుపునిచ్చారని పేర్కొన్నారు. అన్ని వ్యాపార సంస్థలు బంద్ పెట్టి సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బుస్స ఆంజనేయులు, ఆకుల ప్రసాద్, పోల్కం గంగ కిషన్, కరిపె రవీందర్, దర్శనం దేవేందర్, సత్య ప్రకాష్, కొయ్యాడ శంకర్, శ్రీలత, చంద్రమోహన్, విజయ్, బసవసాయి, వాసం జయ, రుక్మిణి, బాలన్న తదితరులు పాల్గొన్నారు.