బతుకమ్మ, ఏర్గట్ల :
మండలంలోని బట్టాపూర్ తండాకు చెందిన గోదావరి కి రాష్ట్ర మహిళా పోలీస్ కబడ్డీ జట్టులో చోటు దక్కినట్లు తెలిపారు. మార్చి 2 నుండి 6వ తేది వరకు పంజాబ్ రాష్ట్రం లోని జలంధర్ లో జరిగే జాతీయ స్థాయి పోలీస్ మహిళల కబడ్డీ పోటీలో పాల్గొననున్నట్లు గోదావరి కుటుంబ సభ్యులు తెలిపారు. రాష్ట్ర మహిళా పోలీసు కబడ్డీ జట్టులో చోటు దక్కడం పట్ల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు లింగయ్య, కార్యదర్శి గంగాధర్, కోచ్ మీసాల ప్రశాంత్, పోలీస్ అధికారులు,సీనియర్ క్రీడాకారులు,వ్యాయమ ఉపాధ్యాయులు క్రీడాకారిని గోదావరి ని అభినందించారు.