నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సంస్కార భారతి ఇందూరు మహానగర ఆధ్వర్యంలో శనివారం న్యాల్కల్ గ్రామంలో సద్దుల బతుకమ్మ సందర్భంగా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ బతుకమ్మ అలంకరణ కి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ మాతృ శక్తి కన్వీనర్, మాధురి కార్యదర్శి, వరలక్ష్మి, రమణ చారి, ప్రాంత కార్యదర్శి, శ్రీనివాస్ రెడ్డి , శ్రీకాంత్ మదు చారి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
