నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సంస్కార భారతి ఇందూరు మహానగర్ ఆధ్వర్యంలో బతకమ్మ సంబరాలను బుధవారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం వారి ప్రోత్సాహంతో సంస్కార భారతి బతుకమ్మ పాటలు పోటీలు ఉత్తమ బతుకమ్మ అలంకరణ పోటీలు నిర్వహించి ప్రథమ ద్వితీయ బహుమతుల్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో వాసవి కన్యకా పరమేశ్వరి అధ్యక్షులు పాల్తి రవికుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర గుప్తా, కోశాధికారి మామిడి శేఖర్ గుప్తా, సంస్కార భారతి మాతృశ్రీ కన్వీనర్ సముద్రాల మాధురి, వరలక్ష్మి, శ్రీలత, నాగుర్తి శంకర్, రమణాచారి, కందకుర్తి ఆనంద్, పవన్ కుమార్, బెజ్గం శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, బున్ని, మల్లేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

