Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 January 2025, 7:14 pm Posted by : ramakrishna

బస్తీ దవాఖానాల్లో నాణ్యమైన సేవలు అందించాలి

  • బస్తీదావఖానా లను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఎంహెచ్ వో

 

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :  బస్తీ దవాఖానాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలని డీఎంహెచ్ వో రాజశ్రీ అన్నారు. బుధవారం ఖానాపూర్, నాగారం బస్తీదావఖానా లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధినిరోధక  టీకాల కార్యక్రమాన్ని ,పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని మాట్లాడుతూ ప్రతి ఆశ కార్యకర్త డ్యూ లిస్టును మెయింటైన్ చేస్తూ ఒకరోజు ముందే టీకాలు ఎవరికి ఇవ్వాలో వారిని బస్తి దావఖానాలకు వచ్చేలా చూడాలన్నారు. వ్యాక్సిన్ క్యారియర్ ఐస్ ప్యాక్సులో కూలింగ్ ఉండేలా చూడాలన్నారు. బస్తీ దావకానాల్లో , ఆరోగ్య కేంద్రాల్లో శుభ్రతను పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుకూలంగా ప్రతి ఉద్యోగి పనిచేయాలన్నారు. ముఖ్యంగా సమయపాలన పాటిస్తూ ప్రతిరోజు ఓపిని చూడాలని,లీవ్స్ రిజిస్టర్ మైంటైన్ చేస్తూ,లీవ్స్ ను డిప్యూటీ డిఎంహెచ్వోల అనుమతి తీసుకోవాలని,డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ లు వారి స్థానంలో ఇతరులను వారికి బదులు  నియమించాలని కోరారు. ఖానాపూర్ బస్తి దావకాన స్థానిక మొదక్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి,నాగారం బస్తీ దావకాన వారు స్థానిక పట్టణా ఆరోగ్య కేంద్రం సీతారాం నగర్ కాలనీ నుండి సరిపడా మందులను తీసుకోవాలన్నారు.రికార్డులు మెయింటైన్ చేయాలని,క్షేత్రస్థాయిలో గృహ సందర్శన చేసి వ్యాధిగ్రస్తులను బస్తీ దావకానకు తరలించేలా ఆశాలు,ఏఎన్ఎం లు చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో  వైద్యాధికారులు ,ఏఎన్ఎం లు,ఆశాలు పాల్గొన్నారు.