నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మామిళ్ల సాయరెడ్డి, ప్రధాన కార్యదర్శి మాణిక్ రాజు, ప్రభుత్వ ప్లీడర్ అమిదాల సుదర్శన్ మంగళవారం జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ని ఆయన చాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసి పుషగుచ్చం అందజేశారు. జిల్లా నూతన కలెక్టర్ గా ఆయన బాధ్యతలు చెప్పట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సాయరెడ్డి, మాణిక్ రాజు లు కలెక్టర్ తో మాట్లాడుతూ నిజామాబాద్ న్యాయ వ్యవస్థ కు అలంబనగా నిలిచి, అభివృద్ధి కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు. న్యాయ వ్యవస్థ పట్ల అపారమైన గౌరవo ఉన్నదని, ప్రగతి మెట్లకు తనవంతు సహకారం సంపూర్ణంగా లభిస్తుందని కలెక్టర్ తెలిపారు.