బాపూజీ వచనాలయ పాలకవర్గం పారదర్శకంగా పనిచేయాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల నూతనంగా ఎన్నికైన బాపూజీ వచనాలయ పాలకవర్గం కమిటీ పారదర్శకంగా పనిచేయాలని పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు భాస రాజేశ్వర్ సూచించారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాపూజీ వచనాలయం విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందించే విధంగా పాలకవర్గం పనిచేయాలని సూచించారు. సామాజిక, రాజకీయ సామాజిక స్పృహ పెంపొందించే విధంగానూతన పాలకవర్గం కృషి చేయాలన్నారు. సిబ్బందికి మూడు సంవత్సరాలకు వేతన సవరణ జరగాలన్నారు. సంస్థ పేరు చెప్పుకొని కొందరు తమ స్వలాభం...